మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'ఫిదా' విడుదలై నాలుగు వారాలయ్యింది. ఐదో వారంలో కూడా ఆడియన్స్ ని థియేటర్ కి రప్పిస్తోంది ఈ సినిమా. తెలంగాణా అమ్మాయి నేపధ్యంతో రూపొందిన ఈ సినిమా ఆంధ్ర ప్రజలను సైతం కట్టిపడేసింది. కళలకు భాషా భేదంలేదని ఈ సినిమా నిరూపించింది.
కృష్ణా జిల్లాలో 2.05కోట్లు షేర్ రాబట్టి అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. చిన్న సినిమాగా విడుదలై భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ వసూళ్ల లెక్కల ప్రకారం 45కోట్ల షేర్ ని దాటేసింది ఈ సినిమా. ఐదో వారంలో కూడా కొన్ని ఏరియాల్లో బాగానే వసూళ్లు రాబడుతోంది. రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటున్నారు. మరి ఫైనల్ గా ఈ సినిమా ఏ ఫిగర్ ని టచ్ చేస్తుందో వేచి చూద్దాం.