యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'సాహో' చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరబాద్ లోని సారధి స్టూడియోస్ లో జరుగుతోంది. 5కోట్ల భారీ బడ్జెట్ తో ఈ స్టూడియోలో సెట్ వేసారు. ఈ సెట్ లో ప్రభాస్ పాల్గొనగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అండర్ వాటర్ లో ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేసాడట డైరెక్టర్ సుజిత్. కొన్ని షాట్స్ ఇక్కడ చిత్రీకరించి, మిగతా షాట్స్ ని దుబాయ్ లో చిత్రీకరించబోతున్నారట.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. నెక్ట్స్ షెడ్యూల్ లో శ్రధ్దా జాయిన్ అవుతుందని సమాచారమ్. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ హై టెక్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని ఏక కాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. 150కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది.