చూడాలని ఉంది, ఇంద్ర, యువరాజు తో పాటుగా దాదాపు 50 సినిమాల్లో బాలనటుడిగా తెరపై కనువిందు చేసిన ఘనత మాస్టర్ తేజ సొంతం. మాస్టర్ తేజ ఇప్పుడు తేజగా మారి హీరోగా పరిచయమవుతున్నారు. ఈ లాంచింగ్ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్ (గోపి) నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి సంస్థలో దర్శకత్వ విభాగంలో దాదాపు ఎనిమిదేళ్లు పనిచేసిన హరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత గోపి మాట్లాడుతూ - కథ అద్భుతంగా కుదిరింది. విలేజ్ బ్యాక్డ్రాప్ లో జరిగే యూత్ఫుల్ లవ్ స్టోరీ ఇది. కుటుంబసమేతంగా చూసేలా ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఉయ్యాల జంపాల, స్వామిరారా చిత్రాలకు స్వరాలు సమకూర్చిన సంగీత దర్శకుడు సన్నీ ఎం.ఆర్. మా సినిమాకు బాణీలిస్తున్నారు. ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని అన్నారు.