నందమూరి నటసింహం బాలకృష్ణ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ 'పైసా వసూలు' చిత్రం ఆడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ రోజు ఈ చిత్రంలోని 'పద మరీ...' సాంగ్ ప్రోమోను విడుదల చేసారు. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటకు పులగం చిన్నారాయణ లిరిక్స్ అందించారు. లిరిక్స్ తో పాటు ట్యూన్ అదిరిందని నందమూరి అభిమానులు ప్రశంసిస్తుంటే, హీరోయిన్ ఛార్మీ అయితే 'ఈ పాటకు డ్యాన్స్ చేయాలనుంది' అని కితాబులిచ్చింది,
పూరి కనెక్ట్స్ కి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్న చార్మీ 'పైసా వసూలు' చిత్రానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ రోజు రిలీజైన 'పదమరీ...' సాంగ్ ప్రోమోను ప్రశంసిస్తూ, '' ఇది నా ఫేవరేట్ సాంగ్. నందమూరి బాలకృష్ణ, ముస్కాన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ పాట ఆయన మాస్ సాంగ్ ల్లో బెస్ట్ సాంగ్ గా నిలిచిపోతుంది'' అని కితాబులిచ్చింది. ఇప్పటికే అనూప్ రూబెన్స్ అందించిన పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య ఫ్యాన్స్ కి కూడా పాటలు బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమా విడుదల తర్వాత థియేటర్స్ లో అభిమానుల గోల మాములుగా ఉండదని వారి రెస్పాన్స్ చూస్తేనే అర్ధమవుతోంది. సెప్టెంబర్ 1న థియేటర్స్ కి వస్తోన్న ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ పై వి.ఆనందప్రసాద్ నిర్మించారు. శ్రియసరన్, ముస్కాన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో కియారా దత్ ఐటమ్ సాంగ్ చేసింది.