మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'రంగస్థలం' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. గోదావరి పరిసర ప్రాంతాలకు సంబంధించి వేసిన పల్లెటూరు సెట్ లో ఈ చిత్రంలోని కీలక నటీనటులు రాంచరణ్ పాల్గొనగా షూటింగ్ జరుగుతోంది.
కాగా ఈ సినిమాలోని ఐటమ్ పాట గురించి ఓ వార్త ప్రచారం అవుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో ఐటమ్ పాట చేయబోతోందని, ఆల్ రెడీ ఆమెను సంప్రదించి గ్రీన్ సిగ్నల్ పడేలా చేసుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలో ఏ మాత్రం నిజంలేదట. అసలు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందో లేదో తెలీదుగానీ, సోనాక్షి సిన్హాని ఐటమ్ పాట కోసం సంప్రదించారనే వార్త మాత్రం నిజంకాదని చిత్రం యూనిట్ ద్వారా తెలుస్తోంది. మరి ఈ వార్త ఎలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందో... ఎవరు ఈ పుకారుకి నాంది పలికారో...!