మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ బోయపాటి తన మార్క్ ని ఏ మాత్రం మిస్ అవ్వకుండా బెల్లంకొండ శ్రీనివాస్ తో తెరకెక్కించిన 'జయ జానకి నాయక' చిత్రం ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలై అన్నిసెంటర్స్ లోనూ మంచి వసూళ్లు సాధిస్తూ ముందుకు సాగుతోంది. లవ్ స్టోరీకీ కమర్షియల్ హంగులను జోడించి... సెంటిమెంట్ ని దట్టించి అప్ కమింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ని బలంగా మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యేలా చేసాడు బోయపాటి. 100 థియేటర్స్ యాడ్ అవ్వడంతో పాటు మూడో వారంలోనూ మంచి వసూళ్లు సాధిస్తూ ముందుకు సాగుతున్న నేపధ్యంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను సంతోషాన్ని వ్యక్తపరిచారు.
''జయ జానకి నాయక స్టోరీ లైన్ ని చాలా నమ్మి సినిమా చేసాను. జనరేషన్స్ మారొచ్చు. సాంకేతికంగా ఎంతైనా ఎదగొచ్చు. కానీ హ్యమన్ రిలేషన్స్ మారవు. అందుకే హ్యుమన్ రిలేషన్స్ ప్రధాన అంశంగా తీసుకుని చేసిన 'జయ జానకి నాయక' చిత్రం అంతటి ఆదరణ పొందుతోంది. ఇలాంటి చిత్రాలు ప్రతి కుటుంబానికి రీచ్ అవుతాయి. ఇందులోని క్యారెక్టర్స్ తో తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారు. నటీనటులందరూ చాలా ఇష్టంగా ప్రాణం పెట్టి ఈ సినిమా చేసారు, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి సినిమా అంటే ప్యాషన్. సినిమా బాగా రావాలనే తపనతో ఏం చేయడానికైనా వెనుకాడకూడదనే మెంటాల్టీ కలిగిన వ్యక్తి. తన బ్యానర్ లో మరో సినిమా కూడా చేస్తాను'' అని చెప్పారు బోయపాటి.