'యుద్ధం శరణం' చిత్రం చేసిన యువసామ్రాట్ నాగచైతన్య మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చందు మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' టైటిల్ తో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. మరోవైపు మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ కోసం ఓ సినిమా చేయబోతున్నాడు నాగచైతన్య.
కాగా తాజా వార్తల ప్రకారం నాగచైతన్య సినిమా కోసం సితార ఎంటర్ టైన్ మెంట్స్ 'మంచోడు' టైటిల్ ని ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేసారు. 'బాబు బంగారం', 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు' అంటూ వరుసగా ఇంట్రస్టింగ్ టైటిల్స్ ను తన సినిమాలకు ఫిక్స్ చేస్తున్న మారుతి ఇప్పుడు నాగచైతన్యను 'మంచోడు' గా తీర్చిదిద్దబోతున్నాడన్నమాట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.