మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రంగస్థలం'. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాంచరణ్ లుక్, టైటిల్ ఈ సినిమాపై పబ్లిక్ కి ఆసక్తిని కలిగిస్తే, ట్రేడ్ వర్గాలు ఈ సినిమాపై దృష్టి సారించాయి. శాటిలైట్. డిజిటల్, ఓవర్ సీస్, వైజాగ్, సీడెడ్ హక్కుల కోసం భారీ డీల్ కుదిరిందని సమాచారమ్. ఆ వివరాల్లోకి వెళితే...
అమెజాన్ వీడియో రైట్స్, యుట్యూబ్ రైట్స్, శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ చానెల్ 29కోట్లు ఇచ్చి దక్కించుకుందట. థియేట్రికల్ రైట్స్ కోసం అన్ని ఏరియాల నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయట. ఇప్పటికే వైజాగ్ హక్కుల నిమిత్తం 8.3కోట్లు, సీడెడ్ నిమిత్తం 13కోట్లు, ఓవర్ సీస్ హక్కుల కోసం 9కోట్లుతో డీల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది మిగతా ఏరియాలకు కూడా ఇదే రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట. దీనిబట్టి ఈ సినిమాకి ఈ రేంజ్ లో క్రేజ్ నెలకొందో ఊహించుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.