ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో రూపొందిన 'స్పైడర్' చిత్రం ఈ 27న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలవుతోంది. తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలకాబోతున్న ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ వేడుక ఈ రోజు (15.9.2017) హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ వేడుకలో మహేష్ బాబు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు తన అభిమానులను ఉద్య్ధేశించి మాట్లాడుతూ - ''మీ లాంటి అభిమానులు ఏ హీరో కి ఉండరు. మీరు నాకు నచ్చుతారు. ఎందుకంటే మీరు నా సినిమా నచ్చితేనే చూస్తారు నచ్చకపోతే చూడరు. మీరెప్పుడు అలానే ఉండాలి. మీ కోసం మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను . సెప్టెంబర్ 27 న స్పైడర్ రిలీజ్ అవ్వబోతోంది. అన్ని పండగలకన్నా ఈ పండగకి పెద్దగా కొట్టబోతున్నాం అనుకుంటున్నాం. మీ ఆశీస్సులతో అలాగే జరుగుతుంది'' అని చెప్పాడు మహేష్.
ఈ వేడుకలో సూపర్ స్టార్ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, నమత్రామహేష్, గౌతమ్, సితార లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.