నిర్మాత దిల్ రాజు నిర్మించిన హిట్ చిత్రాల్లో 'మిస్టర్ ఫర్ పెక్ట్' ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోయిన్లుగా దశరధ్ దర్శకత్వంలో రూపొందిన 'మిస్టర్ ఫర్ పెక్ట్' చిత్రం 2011, ఆగస్ట్ లో విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా విషయంలో నిర్మాత దిల్ రాజుపై కేసు నమోదవ్వడం విశేషం.
శ్యామలరాణి అనే మహిళ నిర్మాత దిల్ రాజుపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్ర కథకి ఒరిజినల్ రైటర్ తనేనని, తన స్ర్కిఫ్ట్ తోనే ఈ చిత్రం తెరకెక్కిందని పేర్కొంటూ దిల్ రాజుపై కంప్లైంట్ ఇచ్చింది శ్యామల. ఈ కంఫ్లైంట్ ని నమోదు చేసుకున్న పోలీసులు దిల్ రాజుపై 120ఎ, 415, 420 సెక్షన్ లతో పాటు కాఫీ రైట్ యాక్ట్ 63 సెక్షన్ లతో కేసు నమోదు చేసారు. సెలబ్రెటీస్ ని వివాదాల్లోకి లాగడం కామనైపోయింది. మరి ఇప్పుడు దిల్ రాజుపై పెట్టిన కేసు కూడా ఇలాంటిదేనా లేక నిజంగానే శ్యామలరాణి స్ర్కిఫ్ట్ ఆధారంగానే 'మిస్టర్ ఫర్ ఫెక్ట్' చిత్రం తెరకెక్కిందా అనే విషయం పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది.