యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందిన 'జై లవ కుశ' చిత్రం సెప్టెంబర్ 21న థియేటర్స్ కి వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్న ఎన్టీఆర్... త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమా గురించి మాట్లాడాడు. ఆ వివరాల్లోకి వెళితే...
త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గి.. లుక్ పరంగా, ఫిజిక్ పరంగా పలు మార్పులు చేయబోతున్నాడని, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోబోతున్నాడని, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించి ట్రైనింగ్ తీసుకోబోతున్నాడని వార్తలు ప్రచారమయ్యాయి. ఇప్పటివరకూ తన గత సినిమాల్లో ఎన్టీఆర్ మార్షల్ ఆర్ట్స్ పెర్ ఫామ్ చేయలేదు. కానీ త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ లైన్ కి స్కోప్ ఉండటంతో ఎన్టీఆర్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాడని వార్తలు వచ్చాయి. దాంతో ఎన్టీఆర్ అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. త్రివిక్రమ్ సినిమాలో తమ అభిమాన హీరో కొత్త లుక్ లో కనిపించబోతున్నాడని ఫిక్స్ అయిపోతున్నారు.
కాగా ఈ విషయం గురించి ఎన్టీఆర్ స్పందిస్తూ ''త్రివిక్రమ్ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేయబోతున్నాను. కథకు స్కోప్ ఉంది'' అని చెప్పాడు. సో... ప్రచారమైన వార్తలు నిజమేనని ఎన్టీఆర్ స్ఫష్టం చేయడంతో తదుపరి సినిమాకి అభిమానులను, సినీప్రియులను ఎన్టీఆర్ థ్రిల్ చేయబోతున్నాడని ఫిక్స్ అయిపోవచ్చు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ సినిమా ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం.