యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రం మరో రెండు రోజుల్లో థియేటర్స్ కి వస్తోంది. ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది. ఆమె నటన, డ్యాన్స్ పట్ల ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్ ఓ విషయంలో మాత్రం ఆమెను నిరాశపరిచాడట.
రాశిఖన్నా 'జై లవ కుశ' లోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవాలనుకుందట. ఈ విషయాన్ని డైరెక్టర్ బాబి దగ్గర చెప్పిందట. ఎన్టీఆర్ వరకూ ఈ విషయం వెళ్లిందట. అయితే ఎన్టీఆర్ ఖరాఖండిగా నో చెప్పేసాడట. ''రిస్క్ తీసుకోవడం ఎందుకు... గత సినిమాల్లో ఆమెకు ఎవరు డబ్బింగ్ చెప్పారో వారితోనే డబ్బింగ్ చెప్పించండి'' అని చెప్పేసాడట. పైగా టైమ్ కూడా పెద్దగా లేదు, రిలీజ్ డేట్ దగ్గరపడింది కాబట్టి, ఈ సమయంలో రాశిఖన్నాతో డబ్బింగ్ చెప్పించడమంటే టైమ్ కిల్ చేయడమే అనుకున్నాడట ఎన్టీఆర్. అందుకే రాశిఖన్నా అడిగినా నో చెప్పేసాడట. దాంతో రాశిఖన్నాకి రెగ్యులర్ గా డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ తోనే డబ్బింగ్ చెప్పించారు. ఇది రాశిఖన్నాని కొంచెం నిరాశపరిచిందట. ఏదేమైనా తెలుగు నేర్చుకున్న రాశిఖన్నా తన నెక్ట్ప్ సినిమాకి డబ్బింగ్ చెప్పుకోవాలనే పట్టుదలతో ఉందట. సో... నెక్ట్ప్ సినిమాకైనా అమ్మడి కోరిక తీరుతుందేమో వేచి చూడాల్సిందే.