యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రం ఎల్లుండి (21.9.2017) థియేటర్స్ కి వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసాడు. అన్నయ్య జై క్యారెక్టర్ నెగటివ్ షేడ్ తో కూడుకున్నది. తమ్ముళ్లు లవ, కుశ మీద పగ తీర్చుకునే పాత్ర. జై క్యారెక్టర్ నెగటివ్ షేడ్ తో ఉంటుందనే విషయం రివీల్ అయిపోయింది, అయితే తమ్ముళ్ల మీద అన్నయ్య ఎందుకు పగ తీర్చుకుంటాడు... ఎలా పగ తీర్చుకుంటాడు అనే విషయంలోఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.
తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం లవకుమార్ ఉద్యోగం చేస్తున్న బ్యాంక్ లో జై పెద్ద ఎత్తున దోపిడికి ప్లాన్ చేస్తాడట. ఈ దొంగతనంలో లవ, కుశ లను ఇరుక్కునేలా చేప్తాడట. ఆ రకంగా లవ, కుశపై పగ తీర్చుకుంటాడట జై. తమ్ముళ్లకు చుక్కలు చూపిస్తాడట. ట్విస్ట్ లు, అన్నదమ్ముల మధ్య సాగే సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయట. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ పెర్ ఫామెన్స్ అదిరిపోయేలా ఉంటుందని, ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అని థియేటర్స్ నుంచి బయటికి వచ్చే ఆడియన్స్ అంటారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ అంచనాలతో సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో వేచి చూద్దాం.