పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి 10న ఈ సినిమా విడుదలకానుంది. మరోవైపు మెగా పవర్ స్టార్ రాంచరణ్ 'రంగస్థలం' చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని... బాబాయ్, అబ్బాయ్ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదని వార్తలు ప్రచారమవుతున్నాయి. దీనికి సంబంధించి బాబాయ్, అబ్బాయ్ మధ్య కూడా మనస్ఫర్ధలు నెలకొన్నాయని మాట్లాడుకుంటున్నారు.
కాగా దీనికి సంబంధించి ఓ చానెల్ తో రాంచరణ్ మాట్లాడుతూ - ''బాబాయ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు 'రంగస్థలం' చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచన లేదు. ఒకవేళ అలాంటి సిట్యువేషన్ వస్తే, బాబాయ్ తో చర్చిస్తాను. మేమిద్దరం మాట్లాడుకున్న తర్వాతే రిలీజ్ విషయంలో నిర్ణయం తీసుకుంటాము. అంతేకానీ నేను, బాబాయ్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నామనే వార్తలు నిజంకాదు. అలాంటి అవకాశమే లేదు'' అని చెప్పాడట. సో... బాబాయ్, అబ్బాయ్ బాక్సాఫీస్ వార్ అని వస్తున్న వార్తలు నిజంకాదు. ఆ ఇద్దరి మధ్య దీనికి సంబంధించి మనస్ఫర్ధలు నెలకొన్నాయనే వార్తలు కూడా నిజంకాదని ఫిక్స్ అయిపోవచ్చు.