మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో 'రంగస్థలం' చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ తదుపరి సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మించడానికి సమాయత్తమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా డీల్ కి సంబంధించి ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్ గా హాట్ గా చర్చలు సాగుతున్నాయి.
పవన్ కళ్యాణ్ కి 40కోట్లు పారితోషికం ఇవ్వడానికి అంగీకరించిన ఈ నిర్మాతలు భారీగా అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చేసారట. 40కోట్లు పవన్ కళ్యాణ్ కి పారితోషికం ఇచ్చి, మరో 40కోట్లుతో సినిమా పూర్తి చేసి, 120కోట్లుకు సినిమాని బిజినెస్ చేయాలనేది వీరి ప్లాన్. అయితే అడ్వాన్స్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయాలా లేదా అనే ఆలోచనలో ఉన్నాడట. జనసేన పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో పూర్తిగా ఇన్ వాల్వ్ అవ్వాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల జనసేన పార్టీ వ్యవహారాలను చక్కబెట్టలేమని భావిస్తున్నాడట. అందుకే మైత్రి మూవీ మేకర్స్ కి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే భారీగా అడ్వాన్స్ ఇచ్చారు కాబట్టి, మైత్రి మూవీ మేకర్స్ కి ఆ డబ్బుకి ఇంట్రెస్ట్ లాస్ అవుతారు. దాంతో ఎలాగైనా ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఈ నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టి, పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతున్నారట.
55రోజులు డేట్స్ కేటాయిస్తే, సినిమా పూర్తి చేసేస్తామని చెబుతున్నారట ఈ నిర్మాతలు. ఇలా చేయాలంటే పక్కా ప్లానింగ్ తో ఉండాలి. లేకపోతే షూటింగ్ పూర్తి చేయడం చాలా కష్టం. మరి ఈ నిర్మాతల ప్లానింగ్ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా… లేక తీసుకున్న అడ్వాన్స్ ని తిరిగి ఇచ్చేస్తాడా వేచి చూడాల్సిందే.