'శతమానం భవతి' తో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వేగ్నేశ సతీష్ తో దిల్ రాజు 'శ్రీనివాస కళ్యాణం' టైటిల్ తో ఓ సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ఈ సినిమా నిర్మించడానికి దిల్ రాజు ప్లాన్ చేసాడు. కానీ రాంచరణ్ ఈ సినిమాకి నో చెప్పాడు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కూడా అప్రోచ్ అయ్యారు. సతీష్ వేగ్నేశ చెప్పిన స్టోరీ లైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్ డైరెక్టర్ ని మాత్రం మార్చాల్సిందేనని చెప్పాడట. 'శ్రీనివాస కళ్యాణం' స్టోరీ లైన్ ని వేరే హీరోతో చేయాలా లేక డైరెక్టర్ సతీష్ వేగ్నశ నుంచి కథ తీసుకుని ఎన్టీఆర్ కోసం వేరే డైరెక్టర్ ని ఫిక్స్ చేయాలో తెలీక ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న దిల్ రాజు కి హీరో దొరికేసాడని సమాచారమ్.
తాజా వార్తల ప్రకారం ఇదే స్టోరీ లైన్ ని హీరో నితిన్ కి చెప్పాడట సతీష్ వేగ్నేశ. ఈ స్టోరీ లైన్ కి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడని సమాచారమ్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్ నగర్ టాక్. సో… శ్రీనివాస కళ్యాణం కి నితిన్ ముందుకు వస్తున్నాడని చెప్పొచ్చు.