'ఆగడు', 'బ్రూస్ లీ', 'మిస్టర్' చిత్రాలతో వరుసగా ఫ్లాప్స్ ని చవిచూసాడు డైరెక్టర్ శ్రీను వైట్ల. దాంతో అతని కెరియర్ డైలమాలో పడిపోయింది. హీరోలెవ్వరూ శ్రీను వైట్లతో సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చడంలేదు. అసలు శ్రీను వైట్లకు హీరోల అపాయింట్ మెంట్ దొరకడంలేదని టాక్. కానీ శ్రీను వైట్ల దర్శకత్వంలో నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను చిత్రాలు చేసిన మాస్ మహారాజా రవితేజ మరోసారి శ్రీను వైట్లతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని వార్తలు వచ్చాయి.
అయితే తాజా వార్తల ప్రకారం ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా టైమ్ పడుతుందట. దాంతో శ్రీను వైట్ల ప్రస్తుతానికి ఈ సినిమాని పక్కన పెట్టేసి వేరే రూటులో సక్సెస్ కొట్టాలనే పట్టుదలతో రంగంలోకి దిగుతున్నాడని సమాచారమ్. వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడట. శ్రీను వైట్లకు కామెడీ మీద చాలా పట్టుంది. ఆయన సినిమాల్లోని కామెడీ ట్రాక్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే ఓ కామెడీ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నాడట శ్రీను వైట్ల. ఇప్పుడు వెబ్ సిరీస్ కి చాలా క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని వెబ్ సిరీస్ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ తో శ్రీను వైట్ల తన సత్తా చాటుకుంటాడేమో వేచి చూడాల్సిందే.