యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన 'టెంపర్' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా ఈ చిత్రం రీమేక్ కానుంది. కాగా ఈ రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం జగదేకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వికి దక్కిందనే వార్తలు ప్రచారమవుతున్నాయి.
ఈ వార్తలపై స్పందించిన డైరెక్టర్ రోహిత్ శెట్టి… రణవీర్ సింగ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుందనే వార్తలు నిజం. కానీ జాన్విని ఈ సినిమా కోసం తీసుకున్నామనే వార్తల్లో నిజంలేదు. ఈ వార్తలు ఎలా పుట్టాయో కూడా తెలీడంలేదు. త్వరలోనే హీరోయిన్ ని ఫైనలైజ్ చేసి, అధికారికంగా ప్రకటిస్తాం అని చెప్పారు. సో… ‘టెంపర్’ రీమేక్ లో జాన్వి హీరోయిన్ అనే వార్త నిజంకాదని ఫిక్స్ అయిపోవచ్చు.