మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రంగస్థలం’ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం చాలా బాగుంటుందట. ముఖ్యంగా రాంచరణ్, ఆది పినిశెట్టి మధ్య సాగే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని సమాచారమ్. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే...
ఈ చిత్రానికి సంబంధించిన నాలుగు కీలక సీన్లు, నాలుగు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయట. కీలకమైన సన్నివేశాలు రాంచరణ్, ఆది పినిశెట్టి కాంబినేషన్ లో ఈ నెలాఖరులోపు చిత్రీకరించబోతున్నారట. ఇక బ్యాలెన్స్ ఉన్న నాలుగు పాటలను వచ్చే నెలలో పూర్తి చేసారట. సమ్మర్ కానుకగా వచ్చే యేడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తోంటే, అనసూయ కీలక పాత్ర చేస్తోంది.