డైరెక్టర్ కొరటాల శివ తన సినిమాల ద్వారా మంచి మెసేజ్ ఇస్తుంటాడు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’ సినిమాలను కొరటాల డీల్ చేసిన విధానం సినీ ప్రియులతో పాటు అందరినీ మెప్పించింది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా కొరటాల శివ ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుందట. తన గత సినిమాల్లో కంటే మరింత స్ట్రాంగ్ మెసేజ్ ‘భరత్ అనే నేను’ చిత్రంలో ఉండబోతోందని వార్తలు అందుతున్నాయి.
‘భరత్ అనే నేను' చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు. అయితే ఏ రాజకీయ పార్టీని టార్గెట్ చేసే విధంగా సీన్స్ ఉండవట. సెటైరికల్ డైలాగులు కూడా ఉండవట. కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ పై కొరటాల ఇవ్వబోతున్న మెసేజ్ మాత్రం అదిరిపోతుందట. అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంటుందట. ఓ మంచి మెసేజ్ .. మరోవైపు రొమాన్స్, ఫ్యామిలీ డ్రామాతో ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. సో... మహేష్ బాబుతో కొరటాల శివ ‘శ్రీమంతుడు’ కంటే భారీ విజయాన్ని దక్కించుకునే సినిమా చేస్తున్నాడని ఫిక్స్ అయిపోవచ్చు.