గ్రేట్ డైరెక్టర్ డా.దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ కుమార్ విలన్ గా నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నాడనే వార్తలు ఉన్నాయి. నిర్మాత అల్లు అరవింద్ కూడా 'సరైనోడు' చిత్రం కోసం దాసరి అరుణ్ కుమార్ ని విలన్ గా తీసుకుందామనుకున్నారట. కానీ ఎందుకనో వర్కవుట్ అవ్వలేదు. అయితే అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఒక్క క్షణం’ చిత్రంలో దాసరి అరుణ్ కుమార్ నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. తాజా వార్తల ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ నరసింహారెడ్డి చిత్రంలో దాసరి అరుణ్ కుమార్ ని ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ‘సైరా’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభంకానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయట. ఆల్ రెడీ ఈ సినిమా కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సునీల్ లను తీసుకున్నారు. ఇప్పుడు దాసరి అరుణ్ కుమార్ ని కూడా తీసుకున్నారనే వార్తలు బయటికి పొక్కాయి. మరి అరుణ్ కుమార్ ని ఎలాంటి పాత్ర కోసం తీసుకున్నారో తెలియాల్సి ఉంది. మొత్తం మీద ‘సైరా’ నరసింహారెడ్డి ని భారీగా ప్లాన్ చేస్తున్నారని ఊహించవచ్చు.