విక్టరీ వెంకటేష్ తో డైరెక్టర్ తేజ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ 19 నుంచి ఆరంభంకానుందని వినికిడి. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ తాజా వార్త బయటికి వచ్చింది. అదేంటంటే...
సురేష్ ప్రొడక్షన్స్, ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం కోసం అదితిరావ్ హైదరీని కథానాయికగా తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజా వార్తల ప్రకారం శ్రియసరన్ ని హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారమ్. 'సుభాష్ చంద్ర బోస్' సినిమా కోసం వెంకటేష్, శ్రియ జత కట్టారు. వెంకటేష్ హీరోగా రూపొందిన 'తులసి' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది శ్రియ. ఆ తర్వాత 'గోపాల గోపాల' సినిమాలో వెంకీ, శ్రియ భార్యభర్తలుగా నటించారు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ తేజ సినిమా కోసం రిపీట్ కానుంది. ఈ సినిమాలో భార్యభర్తలుగా మాత్రమే కాదు... ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా నటించబోతున్నారు వెంకటేష్, శ్రియ. చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ లైన్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ‘ఆట నాదే వేట నాదే’ టైటిల్ ని ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారని సమాచారమ్.