మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్న చిత్రం సెకండ్ షెడ్యూల్ వచ్చే వారంలో ఆరంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో భారీ తారాగణం నటించబోతోంది. రాంచరణ్ నలుగురు అన్నయ్యలకు తమ్ముడిగా నటించబోతున్నాడని తెలుస్తోంది. ఆల్ రెడీ రాంచరణ్ పెద్దన్నయ్య పాత్ర కోసం తమిళ హీరో ప్రశాంత్ ని తీసుకున్న బోయపాటి శ్రీను, రెండో అన్నయ్య పాత్ర కోసం నవీన్ చంద్రను ఎంపిక చేసాడనే వార్తలు ఉన్నాయి. తాజాగా మరో వార్త వినబడుతోంది.
ఆర్యన్ రాజేష్ ని ఈ సినిమా కోసం కాంటాక్ట్ చేసినట్టు సమాచారమ్. కీలక పాత్ర కావడంతో ఆర్యన్ రాజేష్ ని తీసుకోవాలనుకుంటున్నారట. ఆర్యన్ రాజేష్ తో అనన్య జత కట్టనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో స్నేహ, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు చేస్తుండగా కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తం మీద భారీ తారాగణంతో ఓ చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ నుంచి రానుందని ఫిక్స్ అయిపోవచ్చు.