కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సాక్ష్యం' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత శ్రీనివాస్ చేయబోయే సినిమా కన్ ఫార్మ్ అయ్యిందని, 'జీనియస్', 'రాజుగారి గది', 'రాజుగారి గది 2' చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఓంకార్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ తాజా వార్తల ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి సినిమా ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కనుందని తెలుస్తోంది.
శ్రీనివాస్ రెడ్డి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో శ్రీనివాస్ రొమాన్స్ చేయబోతున్నాడని సమాచారమ్. ఈ నెల 23న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుందని, వచ్చే నెల 2 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభం అవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి యస్.యస్.తమన్ సంగీతం సమకూర్చబోతున్నాడట. ఇంకా ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న'సాక్ష్యం' సినిమా సమ్మర్ కానుకగా మే 11న విడుదలకానుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.