సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్ లో శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. జె.భగవాన్-జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నుంచి మొదలవ్వనుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్ - జె.పుల్లారావు మాట్లాడుతూ - టాలెంట్ తో మాస్ హీరో ఇమేజ్ సొంతం చేసుకొన్న సాయిధరమ్ తేజ్, కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లాంటి గోపీచంద్ మలినేనిల కాంబినేషన్ లో సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది. ఒక కొత్త జోనర్ చిత్రంగా ఈ సినిమా ఉండబోతోంది. ఇదివరకూ సాయిధరమ్ తేజ్ చేయని కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందనుంది. లేటెస్ట్ మ్యూజికల్ సెన్సేషన్ ఈ చిత్రానికి బాణీలు సమకూర్చనున్నాడు. గోపీచంద్ ప్రస్తుతం మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక చేస్తున్నారు అన్నారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ 'విన్నర్' చిత్రం చేస్తున్నాడు. మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది.