మెగా పవర్ స్టార్ రాంచరణ్ 'రంగస్థలం' చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు త్వరలో ఆరంభంకానున్నాయి. మార్చి 30న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా విడుదలకు ముందు రెండు భారీ వేడుకలను జరపడానికి చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఆ వివరాల్లోకి వెళితే...
ఈ సినిమా ఆడియో వేడుకను మార్చి ఫస్ట్ వీక్ లో వైజాగ్ లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత మార్చి రెండో వారంలో హైదరాబాద్ లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెగాభిమానులు ఈ వేడుకల్లో భారీగా పాల్గొనబోతున్నారట. రెండు వేడుకలు జరపడం వల్ల మెగాభిమానులను ఉత్సాహపరిచినట్టు ఉంటుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. ఆడియో వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొనబోతున్నారని సమాచారమ్. సో.. మెగాభిమానులకు ఇది పండగలాంటి వార్తేనని చెప్పొచ్చు.