పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాలనుకున్న సినిమా కోసం 'కందిరీగ' ఫేం డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కథ తయారు చేసిన విషయం తెలిసిందే. తమిళ్ సినిమా 'తెరి' ఆధారంగా ఈ సినిమా స్టోరీ లైన్ ని ప్రిపేర్ చేసారు. ఇప్పుడు సినిమాల్లో నటించడానికి పవన్ కళ్యాణ్ నో చెప్పడంతో డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఇదే స్టోరీ లైన్ ని మాస్ మహారాజా రవితేజకు చెప్పాడని సమాచారమ్.
కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కోసం లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. 'టచ్ చేసి చూడు' సినిమా కోసం రవితేజ సరసన లావణ్య త్రిపాఠిని నటింపజేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ అప్పట్లో ఎందుకనో ఈ కాంబినేషన్ వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ సినిమా కోసం రవితేజ, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ సెట్ అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది, ఇందులో ఇంకెవరు నటించబోతున్నారు, సాంకేతికవర్గం తదితర విషయాలు తెలియాల్సి ఉంది.