నారా రోహిత్, శ్రీ విష్ణు కాంబినేషన్ లో తెరకెక్కిన 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రానికి దర్శకత్వం వహించిన సాగర్ చంద్ర కొంత గ్యాప్ తర్వాత తదుపరి సినిమాకి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాతో మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఈ డైరెక్టర్.
'ఫిదా', 'తొలిప్రేమ' సక్సెస్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ మంచి మలుపు తీసుకుంది. అతని మార్కెట్ రేంజ్ పెరిగింది. ప్రస్తుతం 'ఘాజీ' ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. తాజాగా డైరెక్టర్ సాగర్ చంద్ర చెప్పిన స్టోరీ లైన్ కి ఫిదా అయిన వరుణ్ తేజ్ సింగిల్ సిట్టింగ్ లోనే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రాన్ని రామ్ అచంట, గోపీ అచంట నిర్మించనున్నారు. ఇప్పటివరకూ ఎవ్వరూ టచ్ చేయని ఓ పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. మొత్తం మీద డిఫరెంట్ స్టోరీ లైన్స్ తో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న వరుణ్ తేజ్ మరో డిఫరెంట్ స్టోరీ లైన్ తో సినిమా చేయబోతున్నాడని చెప్పొచ్చు.