కింగ్ నాగార్జున, మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వార్ తప్పేలా లేదు. రాంగోపాల్ వర్మతో నాగార్జున 'ఆఫీసర్' టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మే 25న నాగ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో నాగచైతన్య సైతం తన సినిమా 'సవ్యసాచి' ని జూన్ 14కి వాయిదా వేసుకున్నాడు. సోలో రిలీజ్ అయితే బెటర్ అని నాగ్ భావిస్తున్నాడట.
అయితే వరుసగా సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతుండటంతో రవితేజ సైతం తన తాజా సినిమా 'నేల టిక్కెట్' తో మే 24న రంగంలోకి దిగాలని భావిస్తున్నాడట. ఈ డేట్ కరెక్ట్ గా ఉంటుందని చిత్రం యూనిట్ భావించడంతో, 'నేల టిక్కెట్' మే 24న రావడం ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. మే 24న రవితేజ, 25న నాగార్జున సినిమాలు విడుదలైతే, ఏదో ఒక సినిమాకి దెబ్బ పడే అవకాశముంది. ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకి కలిసొస్తుంది, మరో సినిమాకి దెబ్బపడుతుంది. వసూళ్లను కూడా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్ని దృష్టిలో పెట్టుకుని విడుదల తేదీలను ఇలాగే ఫిక్స్ అవుతారో లేక మార్చుకుంటారో వేచి చూడాల్సిందే. విశేషమేంటంటే... 'ఆఫీసర్' డైరెక్టర్ రాంగోపాల్ వర్మని, 'నేలటిక్కెట్' డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాలను దర్శకులుగా పరిచయం చేసింది నాగార్జునే. ఇప్పుడీ ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు.