క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన 'రంగస్థలం' చిత్రం ట్రైలర్ ని నిన్న (18.3.2018) వైజాగ్ లో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేసారు. ఈ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పలువురు సెలబ్రెటీస్ ఈ ట్రైలర్ ని ప్రశంసిస్తున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి రంగంలోకి దిగి రాంచరణ్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
తన ట్విట్టర్ ద్వారా రాంచరణ్ ని అభినందించారు రాజమౌళి. 'రంగస్థలం' చిట్టిబాబు అందరికీ డియర్ అయిపోయాడు. రోజురోజుకి అందరికీ దగ్గరైపోతున్నాడు. 'రంగస్థలం' విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఎదురుచూస్తున్నాను అని పేర్కొన్నారు రాజమౌళి. మొత్తం మీద అందరి దృష్టి తమ సినిమాపై పడేలా చేసేసారు రాంచరణ్, సుకుమార్. మరి ఈ సినిమాతో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటారో వేచి చూడాల్సిందే.