మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'రంగస్థలం' చిత్రం ఫ్రీ రిలీజ్ వేడుక వైజాగ్ లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో భాగంగా పూజా హెగ్డె వేదికపై లైవ్ పెర్ ఫామెన్స్ ఇచ్చింది. ఆఫ్ కోర్స్ ఈ సినిమాలో పూజా హెగ్డె స్పెషల్ సాంగ్ చేసింది. అందుకే లైవ్ పెర్ ఫామెన్స్ ఇచ్చి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ కారణం ఇది కాదట. వేరే ఉదని తెలుస్తోంది.
అమ్మడు లైవ్ పెర్ ఫామెన్స్ కి నిర్మాతలు భారీగా అమౌంట్ ముట్టచెప్పారట. అందుకే పూజా హెగ్డె మారు మాట్లాడకుండా 'రంగస్థలం' ఈవెంట్ లో లైవ్ పెర్ ఫామెన్స్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. అలాగే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా పూజా హెగ్డె బాగానే పారితోషికం తీసుకుందట. మొత్తం మీద 'రంగస్థలం' ని పూజా హెగ్డె బాగానే వర్కవుట్ చేసుకుందని చెప్పొచ్చు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మార్చి 30న థియేటర్స్ కి వస్తోంది.