యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఏప్రిల్ 12 నుంచి ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ఆరంభంకానుందని సమాచారమ్. హైదరాబాద్ లో షూటింగ్ ఆరంభమవుతుందట. ఇక ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి కూడా నిర్మాతలు ఓ క్లారటీకి వచ్చారట. ఆ విషయంలోకి వెళితే...
దసరా కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. అందుకు తగ్గట్టు షూటింగ్ షెడ్యూల్స్, నిర్మాణాంతర కార్యక్రమాలను ప్లాన్ చేసుకున్నారట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఆల్ రెడీ మేకోవర్ అయ్యాడు. బాగా బరువు తగ్గాడు. ఈ చిత్రానికి 'ఆన్ సైలెంట్ మోడ్' టైటిల్ ని పరిశీలిస్తున్నారని సమాచారమ్. పూజా హెగ్డె, శ్రద్ధాకపూర్ హీరోయిన్లుగా నటించబోతున్నారట. జగపతిబాబును విలల్ గా తీసుకున్నారని తెలుస్తోంది. యస్.యస్.తమన్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. 'మనం' ఫేం వినోద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించబోతున్నారు. హారిక హాసిని బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది.