యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్ కి స్టార్ డైరెక్టర్ రాజమౌళి రంగం సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మల్టీస్టారర్ కే విపరీతమైన క్రేజ్ నెలకొంటే, మరో భారీ మల్టీస్టారర్ కి రంగం సిద్ధమవుతోందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ మల్టీస్టారర్ వివరాల్లోకి వెళితే...
ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ చిత్రం చేయడానికి డైరెక్టర్ కొరటాల శివ ప్రయత్నాలు మొదలుపెట్టాడని సమాచారమ్. ఆల్ రెడీ మహేష్ బాబు, ఎన్టీఆర్ తో కొరటాల శివ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చలు జరుపుతున్నాడట. ఈ హీరోలిద్దరూ ఈ ప్రాజెక్ట్ చేయడానికి సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ వార్తల ప్రకారం ఏప్రిల్ 7న జరగబోతున్న 'భరత్ అనే నేను' చిత్రం ఫ్రీ రిలీజ్ వేడుకలో ఈ మల్టీస్టారర్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని వినికిడి. ప్రస్తుతం మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' చిత్రాన్ని నిర్మిస్తున్న డి.వి.వి.దానయ్య ఈ మల్టీస్టారర్ ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా, రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. 'భరత్ అనే నేను' పూర్తయిన తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్. నిజంగానే ఈ మల్టీస్టారర్ వర్కవుట్ అయితే... టాలీవుడ్ ఆడియన్స్ పండగ చేసుకోవడం ఖాయం.