యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ కి సంబంధించి రోజుకో వార్త బయటికి వస్తోంది. 'బాహుబలి', 'బాహుబలి 2' తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం, రిలీజ్ కి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...
ఈ సమ్మర్ లో ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గ్రాండ్ గా జరపడానికి ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ లో షూటింగ్ ని ఆరంభించాలని ఫిక్స్ అయ్యారట. దాదాపు 6 నెలలు షూటింగ్ ని జరిపి, 6 నెలలు నిర్మాణాంతర కార్యక్రమాల కోసం కేటాయించాలనుకుంటున్నారట. వచ్చే యేడాది చివరికల్లా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 ఆరంభంలో ప్రమోషనల్ కార్యక్రమాలను ఆరంభించాలనుకుంటున్నారట. 2020 సమ్మర్ కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే ఎన్టీఆర్, రాంచరణ్ టెస్ట్ షూట్, ఫోటో షూట్ లో పాల్గొన్నారట. ప్రస్తుతం ఇతర నటీనటులను, సాంకేతిక వర్గాన్ని ఫైనలైజ్ చేసే పనిలో రాజమౌళి ఉన్నారని సమాచారమ్. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది,