ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ఈ స్టోరీ లైన్ ని రెడీ చేసారు.
ముందుగా ఈ స్టోరీ లైన్ తో నందమూరి నటసింహం బాలకృష్ణని అప్రోచ్ అయ్యారు పరుచూరి బ్రదర్స్. ఈ సినిమా చేయడానికి బాలయ్య కూడా ఆసక్తి కనబర్చారు. బాలయ్య 100వ సినిమా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అవుతుందని అందరూ భావించారు. అయితే పరుచూరి బ్రదర్స్ ఫుల్ స్ర్కిఫ్ట్ ని రెడీ చేసి బాలయ్యకు వినిపించలేదట. దాంతో బాలయ్య ఈ స్ర్కిఫ్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈలోపు డైరెక్టర్ క్రిష్ 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఫుల్ స్ర్కిఫ్ట్ తో బాలయ్యను కలవడం, ఆయనకు పూర్తిగా స్ర్కిఫ్ట్ నచ్చడంతో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ చిరుని కలిసి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' స్ర్కిఫ్ట్ వినిపించి గ్రీన్ సిగ్నల్ పడేలా చేసుకున్నారు. ఇదిలా ఉంటే...
ఎన్టీఆర్ బయోపిక్ ని మార్చి 29ప ప్రారంభించి కంటిన్యూగా షూటింగ్ చేయడానికి సమాయత్తమవుతున్న బాలయ్య'ముప్తీ' కన్నడ రీమేక్ లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారమ్.