బెల్లంకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం' చిత్రంతో పాటు మరో కొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ సొంటినేని (నాని) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని ప్రకటించారు.
తాజాగా ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోందనే విషయం బయటికి వచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'ఎం.ఎల్.ఎ' చిత్రం రేపు థియేటర్స్ కి వస్తోంది. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న కాజల్ అగర్వాల్ తను కమిట్ అయిన సినిమాల గురించి చెప్పింది. అందులో భాగంగా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకి సైన్ చేసానని ప్రకటించింది కాజల్. మొత్తం మీద కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో రొమాన్స్ చేయబోతోంది కాజల్. ఇప్పటికే సమంత, తమన్నా ఈ కుర్ర హీరోతో రొమాన్స్ చేసారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ కాజల్ వంతు. మరి ఈ జంట ఎలా ఉంటుందో వేచి చూద్దాం.