యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ రోజు నుంచే పూజా హెగ్డె ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతోంది. ఎన్టీఆర్, పూజా హెగ్డె పాల్గొనగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది.
కాగా ఈ సినిమాకి 'అసామాన్యుడు' టైటిల్ ని పెడుతున్నట్టు వార్తలు ప్రచారమయ్యాయి. నిజం చెప్పాలంటే ఈ టైటిల్ ఫిక్స్ చేయలేదట. ఈ టైటిల్ అయితే బాగుంటుందని భావిస్తున్న త్రివిక్రమ్ టైటిల్ ని లీక్ అయ్యేలా చేసారట. తద్వారా పబ్లిక్ లో ఈ టైటిల్ కి ఎలాంటి స్పందన వస్తుందో తెలిసిపోతుంది కాబట్టి, స్పందనను బట్టి టైటిల్ ని ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. ఇక సినిమాని అక్టోబర్ 12న దసరా కానుకగా విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారమ్.