'రంగస్థలం' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం యువసామ్రాట్ నాగచైతన్యతో 'సవ్యసాచి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పాటు మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇవి రెండూ కాకుండా... రవితేజతో 'కందిరీగ' ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాని నిర్మించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. తమిళ్ చిత్రం 'తెరి' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
కాగా ఈ సినిమా కోసం ఓ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు. మరో హీరోయిన్ గా తమన్నాని తీసుకోవడానికి ప్రయత్నాలు చేసారట. ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా, కోటిన్నర పారితోషికం కావాలని డిమాండ్ చేసి షాకిచ్చిందట. ఫస్ట్ లీడ్ కాదు కాబట్టి, ఇంత పారితోషికం ఇవ్వడానికి మైత్రి మూవీస్ అధినేతలు సుముఖంగాలేరట. కానీ తమన్నా మాత్రం కోటిన్నర పారితోషికం కావాలని ఖరాఖండిగా చెప్పేసిందట. దాంతో క్యాథరీన్ ని హీరోయిన్ గా తీసుకోమని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు చెప్పినట్టు సమాచారమ్. సో... రవితేజతో రొమాన్స్ చేసే అవకాశం తమన్నా చేజారినట్టేనని ఫిక్స్ అయిపోవచ్చు.c