మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోన్న విషయం తెలిసిందే. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరోయిన్ కియారా అద్వానీ, రాంచరణ్ లపై రెండు పాటలను చిత్రీకరించడానికి డైరెక్టర్ బోయపాటి ప్లాన్ చేసారట. ఈ సినిమా తెలుగు డిజిటల్ రైట్స్ కి భారీ ఆఫర్ వచ్చిందనే వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. 26కోట్లు ఆఫర్ వచ్చిందని సమాచారమ్. తాజాగా ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ నిమిత్తం 21 కోట్లు ఆఫర్ వచ్చిందట. ఇక ధియేటర్స్ రైట్స్ కోసం కూడా భారీ ఆఫర్స్ వస్తున్నాయట. దీన్నిబట్టి ఈ సినిమా బిజినెస్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ కాబట్టి, కమర్షియల్ గా ఈ సినిమా బాగా వర్కవుట్ అవుతుందనే లెక్కలతోనే ఈ సినిమాకి సెన్సేషనల్ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారమ్. ఇదిలా ఉంటే...
ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా ఐటమ్ పాట చేయబోతోంది. 'రచ్చ' సినిమాలో రాంచరణ్ తో కలిసి నటించిన తమన్నా 'వాన వాన వెల్లువాయే...' పాటలో రెచ్చిపోయి చిందేసింది. మరి ఇప్పుడు ఐటమ్ పాట అంటే... చరణ్ తో కలిసి ఓ రేంజ్ లో రెచ్చిపోతుందని ఊహించవచ్చు. మొత్తం మీద భారీ తారాగణం, భారీ ఖర్చుతో ఈ సినిమాని పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా బోయపాటి శ్రీను తీర్చిదిద్దుతున్నారు.