కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. కె.వి.ఆనంద్ దర్శకత్వంలో 'బ్రదర్స్' అనే సినిమా చేసాడు సూర్య. అవిభక్త కవలలుగా సూర్య ఈ చిత్రంలో డ్యుయెల్ రోల్ లో కనిపించాడు. మళ్లీ ఇప్పుడు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు.
కాగా ఈ సినిమాలో అఖిల్ ఫస్ట్ సినిమా హీరోయిన్ సయేషా సైగల్, మెగా కాంపౌండ్ హీరో అల్లు శిరీష్ నటించబోతున్నారని తెలుస్తోంది. సయేషా సైగల్ ని హీరోయిన్ గా తీసుకున్నారట. ఓ కీలక పాత్ర కోసం అల్లు శిరీష్ ని తీసుకున్నారని సమాచారమ్. మరో కీలక పాత్ర కోసం మోహన్ లాల్ ని కూడా తీసుకున్నారట. సో... భారీ తారాగణంతో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో అల్లు శిరీష్ ఓ కీలక పాత్రలో అలరించనున్నాడు. మరి ఈ సినిమా అల్లు శిరీష్ ని కోలీవుడ్ ఆడియన్స్ కి దగ్గర చేస్తుందేమో వేచిచూద్దాం.