నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన 'జై సింహా' చిత్రంతో భారీ లాభాలను చవిచూసిన నిర్మాత సి.కళ్యాణ్ మళ్లీ బాలయ్యతో ఓ సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. కన్నడ చిత్రం 'ముప్తీ' కి ఇది రీమేక్. ఈ సినిమాకి డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నాడు. కాగా తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి హీరోయిన్ ఖరారయ్యిందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
శ్రియసరన్ ని ఈ సినిమా కోసం హీరోయిన్ గా తీసుకున్నారట. విశేషమేంటంటే బాలయ్యతో 'చెన్నవకేశవరెడ్డి' చిత్రం చేసాడు వినాయక్. ఈ సినిమాలో శ్రియసరన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా వచ్చి 16 సంవత్సరాలు అయ్యింది. ఇంత గ్యాప్ తర్వాత మళ్లీ బాలయ్య, శ్రియ, వి.వి.వినాయక్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. బాలయ్య హీరోగా రూపొందిన 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'పైసా వసూలు' చిత్రాల్లో నటించిన శ్రియ మరోసారి బాలయ్యతో రొమాన్స్ చేయబోతోంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారమ్.