'మహానటి' సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో జీవించిన కీర్తిసురేష్ ని ప్రతి ఒక్కరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి సైతం కీర్తి సురేష్ ని తెగ పొగిడేసారు. కాగా కీర్తిసురేష్ ని తను చేయబోతున్న మల్టీస్టారర్ చిత్రంలో ఓ హీరోయిన్ గా నటింపజేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారనే వార్తలు ప్రచారమయ్యాయి. ఎన్టీఆర్, రాంచరణ్ ఈ చిత్రంలో హీరోలుగా నటించబోతున్నారు కాబట్టి, ఎన్టీఆర్ సరసన కీర్తి సురేష్ ని నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకున్నారు. అయితే ఈ వార్తల్లో నిజంలేదట.
ఈ సినిమాలో నటిస్తున్నాననే వార్తల్లో నిజంలేదని కీర్తిసురేష్ స్ఫష్టం చేసింది. ఇప్పటివరకూ తనను ఈ చిత్రం యూనిట్ కాంటాక్ట్ చేయలేదని కూడా చెప్పింది. దీన్నిబట్టి రాజమౌళి సినిమా కోసం కీర్తిసురేష్ ని కాంటాక్ట్ చేసారనే వార్తలు నిజంకాదని అర్ధం చేసుకోవచ్చు. ఒకవేళ కీర్తిసురేష్ చేయాల్సిన పాత్ర అయితే రాజమౌళి ఖచ్చితంగా ఆమెను తీసుకునే అవకాశముంది. మరి ఆ అవకాశం ఉందో లేదో...!