మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో 'తేజ్ ఐ లవ్ యు' సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు మరో మూడు సినిమాలు కమిట్ అయ్యాడు. గోపీచంద్ మలినేని, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమాలు చేయడానికి సమాయత్తమవుతున్న సాయిధరమ్ తేజ్ 'ఉన్నది ఒక్కటే జిందగీ' ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.
కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమాకి హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేసారని సమాచారమ్. అనుపమాపరమేశ్వరన్, కళ్యాణిప్రియదర్శన్ లను హీరోయిన్లుగా తీసుకున్నారట. అనుపమాపరమేశ్వరన్ ఆల్ రెడీ 'తేజ్ ఐ లవ్ యు' సినిమాలో సాయిధరమ్ తేజ్ తో జత కడుతోంది. ఇప్పుడు రెండోసారి మెగా మేనల్లుడుతో రొమాన్స్ చేయబోతోంది. కళ్యాణిప్రియదర్శన్ ఫస్ట్ టైమ్ సాయిధరమ్ తో జత కట్టబోతోంది. మరి ఈ ఇద్దరి ముద్దుగుమ్మలతో మెగా మేనల్లుడు రొమాన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో వేచి చూద్దాం.