మామ వెంకటేష్, మేనల్లుడు నాగచైతన్య కాంబినేషన్ లో డైరెక్టర్ బాబి ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ నుంచి ఆరంభంకానుందట. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమాకి హీరోయిన్లు కన్ ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది.
నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. 'రా రండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో నాగచైతన్యతో రొమాన్స్ చేసింది రకుల్. రెండోసారి చైతన్యతో ఈ సినిమా కోసం జత కట్టబోతోంది. ఇక వెంకీ అయితే తన లక్కీ హీరోయిన్ నయనతారతో రొమాన్స్ చేయబోతున్నాడు. వెంకటేష్, నయనతార నటించిన 'లక్ష్మీ', 'తులసి', 'బాబు బంగారం' చిత్రాలు హిట్ అయ్యాయి. ఈ ఇద్దరి మధ్య ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. దాంతో ఈ జంటను హిట్ పెయిర్ గా పిలుస్తుంటారు. ఇప్పుడు మళ్లీ వెంకీ, నయనతార జంట రిపీట్ కానుంది. వెంకటేష్, నయనతార.. నాగచైతన్య, రకుల్.. కాంబినేషన్ అదిరిపోలేదు. సో... మామ. అల్లుడు కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధమవుతోందని చెప్పొచ్చు.