'రంగస్థలం' చిత్రాన్ని తమిళ్, హిందీ, మలయాళం, భోజ్ పురి భాషల్లో డబ్ చేసి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్. ఆల్ రెడీ తమిళ్, మలయాళ వెర్షన్స్ ని విడుదల చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థలతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని సమాచారమ్.
తమిళ్ వెర్షన్ ని 'స్టూడియో గ్రీన్' సంస్థ విడుదల చేయబోతోంది. స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా అయినప్పటికీ, ఈ బ్యానర్ కి బ్యాక్ బోన్స్ హీరో సూర్య, కార్తి. ఇక మలయాళ వెర్షన్ ని మోహన్ లాల్ 'ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్' విడుదల చేయనుంది. తమిళ్, మలయాళ వెర్షన్స్ ని ఒకరోజు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఆ రకంగా మరోవైపు భోజపురి, హిందీ లో కూడా ప్రముఖ నిర్మాణ సంస్థలతో టై అప్ అయి విడుదల చేయాలనే ప్లాన్ లో రంగస్థలం నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది. సో... 'రంగస్థలం' డబ్బింగ్ వెర్షన్స్ ని కూడా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారన్నమాట.