రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన 'రంగస్థలం', 'భరత్ అనే నేను' సినిమాల పాటలకు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాలకు సంగీతమందించిన దేవిశ్రీప్రసాద్ తాజాగా టాలీవుడ్ లో రూపొందనున్న రెండు క్రేజీ మల్టీస్టారర్స్ కు పాటలందించే అవకాశాన్ని కొట్టేసాడు. ఈ రెండు మల్టీస్టారర్స్ కామన్ పాయింట్ విక్టరీ వెంకటేష్.
వెంకటేష్ తో ఓ మల్టీస్టారర్ కోసం మెగా హీరో వరుణ్ తేజ్ స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి 'ఎఫ్ 2' టైటిల్ ని ఖరారు చేసారు. మాములుగా అయితే అనిల్ రావిపూడి చిత్రాలకు సాయికార్తీక్ పాటలిస్తాడు. ఈసారి సాయి కార్తీక్ ని కాకుండా దేవిశ్రీ ప్రసాద్ తో టై అప్ అయ్యాడు అనిల్ రావిపూడి. ఇక మరో సినిమా విషయంలోకి వెళితే...
మామ వెంకటేష్, అల్లుడు నాగచైతన్య కాంబినేషన్ లో బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ . ఈ మల్టీస్టారర్ కి పాటలందించే అవకాశం కూడా దేవిశ్రీప్రసాద్ నే వరించడం విశేషం. బాబి దర్శకత్వంలో రూపొందిన 'సర్ధార్ గబ్బర్ సింగ్', 'జై లవ కుశ' చిత్రాలకు దేవిశ్రీ పాటలందించాడు. మూడోపారి బాబి, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది.
సో... టాలీవుడ్ లో తెరకెక్కనున్న రెండు క్రేజీ మల్టీస్టారర్స్ కి పాటలివ్వబోతున్నాడు దేవిశ్రీ ప్రసాద్. మరి తనదైన శైలిలో షేక్ చేసి టాలీవుడ్ ఆడియన్స్ ని కట్టిపడేస్తాడేమో వేచి చూద్దాం.