మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటించబోతున్న విషయం తెలిసిందే. ముందుగా ఈ సినిమా కోసం అనుఇమ్మాన్యువేల్ ని తీసుకున్నారు. కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక తప్పుకోవడంతో ఇలియానా రీప్లేస్ చేస్తోంది. దాదాపు 6 యేళ్ల గ్యాప్ తర్వాత ఇలియానా టాలీవుడ్ లో సినిమా చేయడానికి అంగీకరించింది.
కాగా తాజా వార్తల ప్రకారం పారితోషికం డిమాండ్ చేయకుండానే ఇలియానా ఈ సినిమా అంగీకరించిందట. ఈ మధ్య తన బోయ్ ఫ్రెండ్ ఆండ్రూని పెళ్లి చేసుకున్న ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. అయితే తను ప్రెగ్నెంట్ కాదని జనాలకు తెలిసేలా చేయాలని ఎక్కువ సినిమాలు అంగీకరిస్తోందట ఇలియానా. అందులో భాగంగానే టాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్ కి నో చెప్పకుండా అంగీకరించిందని తెలుస్తోంది. జూన్ మూడో వారం నుంచి యు.యస్ లో జరగనున్న ఈ చిత్రం షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి ఇలియానా సమాయత్తమవుతోందట. సో... టాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తే, మరిన్ని సినిమాలు సైన్ చేయడానికి ఇలియానా రెడీగా ఉందని దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు.