శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొన్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రస్తుతం యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా 'సవ్యసాచి' టైటిల్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. చందు మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం రమ్యకృష్ణతో కింగ్ నాగార్జున చిందేసిన 'నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు....' పాటను రీమిక్స్ చేసారు. 'అల్లరి అల్లుడు' సినిమాలోని ఈ పాటకు మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
కాగా ఈ పాట కోసం నాగచైతన్య తో చిందేయడానికి ఓ టాప్ హీరోయిన్ ని రంగంలోకి దింపుతున్నామని ఈ చిత్రం యూనిట్ అధికారికంగా ప్రకటించారు. అప్పట్నుంచి ఈ హీరోయిన్ ఎవరనే చర్చ జరుగుతోంది.
ఈ స్పెషల్ సాంగ్ కి చైతూతో కలిసి చిందేయడానికి అంగీకరించింది మిల్క్ బ్యూటీ తమన్నా. అల్లుడు శీను', 'స్పీడున్నోడు', 'జై లవ కుశ' చిత్రాల్లో ఐటమ్ పాటలు చేసి భారీ పారితోషికం అందుకుంది తమన్నా. ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ కోసం చైతూతో చిందేయబోతోంది. రమ్మకృష్ణ ఈ పాటకు మాస్ స్టెప్పులేసి ఇరగదీసింది. మరి ఈ మాస్ పాటలో తమన్నా డ్యాన్స్ రమ్యకృష్ణను మించిపోయేలా ఉంటుందా వేచి చూద్దాం.