హీరో గోపీచంద్ 25వ సినిమా 'పంతం' నిన్న (5.7.2018) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయ్యింది. కె.చక్రవర్తి దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మోహ్రీన్ కథానాయికగా నటించింది. మాస్ లో ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. దాంతో మంచి ఓపెనింగ్స్ రాబట్టడంతో చిత్రం యూనిట్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.92 కోట్ల షేర్ ని రాబట్టుకున్న 'పంతం' వరల్డ్ వైడ్ గా 3.22 కోట్ల షేర్ ని దక్కించుకుంది. టోటల్ గా 5.2 కోట్ల గ్రాస్ తో ఈ సినిమా ఫస్ట్ డే వసూళ్లు ఆరంభమవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. ఫస్ట్ డే ఈ సినిమా సాధించిన షేర్ వివరాలు మీ కోసం...
నైజాం - 1.12కోట్లు
సీడెడ్ - 47లక్షలు
నెల్లూరు - 12లక్షలు
గుంటూరు - 33లక్షలు
కృష్ణా - 15.77లక్షలు
వెస్ట్ గోదావరి - 16.35లక్షలు
ఈస్ట్ గోదావరి - 20.92లక్షలు
ఉత్తరాంథ్ర - 34.79లక్షలు
టోటల్ ఎ.పి, తెలంగాణా ఫస్ట్ డే షేర్ - 2 కోట్ల 92లక్షలు
రెస్టాఫ్ ఇండియా - 20లక్షలు
ఓవర్ సీస్ - 10లక్షలు
టోటల్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ షేర్ - 3.22కోట్లు
టోటల్ గ్రాస్ - 5.2కోట్లు