'నా పేరు సూర్య' తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమా ఇంకా ఆరంభమవ్వలేదు. అయితే అల్లు అర్జున్ మూడు సినిమాలను ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడని ఫిల్మ్ నగర్ టాక్. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన అల్లు అర్జున్, ఆ సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సమాయత్తమవుతున్నాడట.
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడట అల్లు అర్జున్. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' లాంటి హిట్ చిత్రాలు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మూడో సినిమాకి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ తో 'రేసు గుర్రం' అంటూ ఓ భారీ హిట్ చిత్రం చేసాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. మళ్లీ సురేందర్ రెడ్డి దర్శ్తకత్వంలో సినిమా చేసే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నాడట.
ఈ డైరెక్టర్లను తన కోసం కథలు రెడీ చేయమని అల్లు అర్జున్ చెప్పేసాడట. దాంతో త్రివిక్రమ్ శ్రీనివాస్, సురేందర్ రెడ్డి ఇద్దరూ అల్లు అర్జున్ కోసం తమ అసిస్టెంట్స్ తో స్టోరీ లైన్స్ ని రాయిస్తున్నారట. త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి ఇద్దరి దర్శకులతోనూ అల్లు అర్జున్ హిట్ సినిమాలే చేసాడు. సో... మళ్లీ ఈ కాంబినేషన్స్ రిపీట్ కాబోతున్నాయి. మొత్తం మీద అల్లు అర్జున్ తన తదుపరి సినిమాల విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడని ఊహించవచ్చు.